డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన రవితేజ కామెడీ డ్రామా భర్త మహాశయులకు విజ్ఞప్తి

Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా కామెడీ డ్రామా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 లో ఫిబ్రవరి 20, 2026 నుండి స్ట్రీమింగ్‌కు రానుంది. ముఖ్యంగా, ఈ మూవీ థియేటర్ రిలీజ్‌కు ముందే జీ5 స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.

రవితేజ గత కొన్ని చిత్రాలతో పోలిస్తే, భర్త మహాశయులకు విజ్ఞప్తి కొంచం మంచి స్పందనను అందుకుంది ప్రేక్షకుల నుండి. క్లిన్ హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేటబుల్ స్టోరీలైన్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.

ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా మరియు కామెడీ కాంబినేషన్ తో రూపొందింది. భార్యాభర్తల సంబంధాలు, కుటుంబ బంధాలు, వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో మరింత మంది ప్రేక్షకులను చేరుకోనుంది.

ఫిబ్రవరి 20 తేదీ ఖరారైన తర్వాత, ఓటీటీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు ఇంటి వద్దే ఈ ఎంటర్టైనర్‌ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల