
‘హ్యాపీ డేస్’ చిత్రంతో గుర్తింపు పొందిన వరుణ్ సందేశ్ ఇప్పుడు ‘నయనం’ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలై, మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘నయనం’ వెబ్ సిరీస్ డిసెంబర్ 19, 2025 నుంచి ZEE5లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఇందులో వరుణ్ సందేశ్తో పాటు ఉత్తేజ్, ప్రియాంక జైన్, అలీ రెజా, రేఖ నిరోషా, హరీష్ తదితరులు నటించారు.
ఈ సిరీస్కు స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించగా, కథ–స్క్రీన్ప్లేను కళ్యాణ్ కాగితపు అందించారు. శుఐబ్ సిద్దిఖీ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, రామ్ తల్లూరి మరియు రాజని తల్లూరి SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు.
